(*పున్నమి* *న్యూస్ ప్రతినిధి కృష్ణ* )ఆగస్టు 03 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణం,గ్రీవెన్స్ సెల్కు గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు తప్పవు: ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిక,నాయుడుపేట తాసిల్దార్ కార్యాలయంలో
ప్రతి సోమవారం నాడు నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమానికి నిర్లక్ష్యంగా గైర్హాజరయ్యే వివిధ శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. విధులకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఫిర్యాదుల స్వీకరణ: కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల నుంచి ఎమ్మార్వో స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఆరా తీశారు.ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మరియు ఇతర సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన గ్రీవెన్స్ డే కి కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అలాంటి కార్యక్రమంలో కొంతమంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా శాఖలపై శాఖాపరమైన చర్యలు తప్పవు.
ప్రజలు తమ సమస్యల పై చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తుంటారని, సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు గుర్తుచేశారు



