ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణలకు ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాయకన్ గూడెం వద్ద ఘన స్వాగతం లభించింది.
వరంగల్ జిల్లా ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్,బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు,జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి,కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చావా కిరణ్, ఎల్లారావు గౌడ్, అనంతు ఉపేందర్, డీకొండ శ్యామ్ తదితరులతో పాటు పాలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నాయకులకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాయకులు సింగరేణి కార్మికుల సంక్షేమం, భవిష్యత్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.



