✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా, రైతు పక్షపాతిగా, అధికారం అంటేనే బాధ్యతగా పేద ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసించారు. ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 నూతన గేట్ల ఏర్పాటు, మరమ్మత్తు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం ఈ ప్రాంత రైతులు చేసుకున్న అదృష్టమని ఎమ్మెల్యే బండారు కొనియాడారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పిచ్చుకలంకలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి సభలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, ఎంపీ హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
గోదావరి డెల్టా రైతుల జీవనాడి, చారిత్రక ధవళేశ్వరం ‘సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ’ని మరింత పటిష్టం చేసే దిశగా ఈరోజు 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు ఘనంగా శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించాము.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేసిన గౌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా కలిసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు…
END

