Saturday, 4 July 2026
  • Home  
  • ఘనంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ-ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జల బృందమ్మ
- తిరుపతి

ఘనంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ-ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జల బృందమ్మ

శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : రేణిగుంట మండల పరిధిలోని నల్లాపాళెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రీ సర్వే ప్రాజెక్టు – పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం’ శనివారం అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులతో కలిసి నల్లాపాళెం గ్రామ లబ్ధిదారులైన రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా మరియు పారదర్శకమైన భూ పరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృఢమైన అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. భూ వివాదాలకు తావులేకుండా రైతుల హక్కులను కాపాడడానికే ఈ రీ సర్వే ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.

శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : రేణిగుంట మండల పరిధిలోని నల్లాపాళెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రీ సర్వే ప్రాజెక్టు – పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం’ శనివారం అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులతో కలిసి నల్లాపాళెం గ్రామ లబ్ధిదారులైన రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా మరియు పారదర్శకమైన భూ పరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృఢమైన అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. భూ వివాదాలకు తావులేకుండా రైతుల హక్కులను కాపాడడానికే ఈ రీ సర్వే ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.