ఎమ్మెల్యే పులివర్తి నాని
గ్రామాల అభివృద్ధితోనే.. రాష్ట్ర అభివృద్ధి సుగమం .
పున్నమి ప్రతినిధి 01 జూలై 2026 రామచంద్రపురం
రామచంద్రాపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్రా – స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి
కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు 12 ట్రై సైకిళ్లను, తడి,పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు
ఎమ్మెల్యే స్వయంగా ట్రై సైకిళ్లను తొక్కి… పంచాయతీ ప్రతినిధులకు పంపిణీ చేశారు.
పంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ట్రై సైకిళ్లు ఉపయోగపడతాయని తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్రా లక్ష్యాలను ప్రతి గ్రామంలో విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు, కూటమి నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.



