-నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఈనెల 28న జరిగే పల్స్ పోలియో 2026 కార్యక్రమంపై ఎంపీడీవో ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ సమావేశం జరిగింది.
సంగం: నెల్లూరు జిల్లా సంగం మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యవేక్షణలో పల్స్ పోలియోపై మండల స్థాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మార్వో,ఎంఈఓ, తదితర మండల అధికారులు హాజరు అయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా. శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పల్స్ పోలియో 2026 వైద్య ఆరోగ్య సిబ్బందితో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28 తేదీన ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు పి హెచ్ సి పరిధిలో ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు సంఘం మండలంలో ఐదేళ్ల లోపు 2996 పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు లకు 23 బూతులు మరియు ఒక ట్రాన్సిస్ట్ ,మొబైల్ వెహికల్ ఒకటి, నాలుగు రూట్ వెహికల్స్ ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. మండలంలో ఉండే ప్రజలందరూ మీ పరిధిలో ఉన్నటువంటి అప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు పోలియో చుక్కల వ్యాక్సిన్ వేయించి పోలియో నిర్మూలనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమము మొదటిరోజు బూత్ ఆక్టివిటీ, రెండవ రోజు మరియు మూడవరోజు ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ హెచ్ ఈ ఓ మల్లం కొండయ్య సూపర్వైజర్ స్టాప్ జలీల్ మేరీ సుజాత మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


