ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఖమ్మం జిల్లాకు చెందిన నలుగురు నేతలకు చోటు కల్పించారు. ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్య నారాయణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, ఖమ్మం నగరానికి చెందిన రుద్ర ప్రదీప్, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం చెందిన ఇవి రమేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. వీరి నియామకం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



