పున్నమి ప్రతినిధి ఆగస్టు 16 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది మత్తడి ప్రవహిస్తున్న ప్రాంతానికి సందర్శకులు వెళ్లవద్దని సిరిసిల్ల డిఎస్పి కత్రోజు నాగేంద్ర చారి ఎల్లారెడ్డిపేట సిఐ వెంకటేష్ హెచ్చరించారు ప్రాజెక్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు



