శ్రీకాళహస్తి, మార్చి 19 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో కొలువై ఉన్న శ్రీ శ్రీ నల్ల గంగమ్మ తల్లి దేవస్థానంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దవనం తడికలతో చంద్ర అలంకరణలో అత్యంత నయనమనోహరంగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ కంటా రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు శాస్త్రోక్తంగా జరిగాయి. చల్లని వెన్నెల కురిపించే చంద్రుడి రూపంలో దవనం తడికల అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ విశేష అలంకారాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దర్శనం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రదీప్, అనిల్, రాజశేఖర్, నారాయణ, సుబ్రహ్మణ్యం, రాజేంద్ర, కపిల్, యాదగిరిలతో పాటు ఆలయ అర్చకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దవనం తడికల వైభవంలో భక్తులకు దర్శనమిచ్చిన నల్ల గంగమ్మ తల్లి
శ్రీకాళహస్తి, మార్చి 19 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో కొలువై ఉన్న శ్రీ శ్రీ నల్ల గంగమ్మ తల్లి దేవస్థానంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దవనం తడికలతో చంద్ర అలంకరణలో అత్యంత నయనమనోహరంగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ కంటా రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు శాస్త్రోక్తంగా జరిగాయి. చల్లని వెన్నెల కురిపించే చంద్రుడి రూపంలో దవనం తడికల అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ విశేష అలంకారాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దర్శనం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రదీప్, అనిల్, రాజశేఖర్, నారాయణ, సుబ్రహ్మణ్యం, రాజేంద్ర, కపిల్, యాదగిరిలతో పాటు ఆలయ అర్చకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

