పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : బడంగ్ పేట్ కార్పొరేషన్ ను సౌత్ సౌత్ జోన్ లో ఉన్నటువంటి చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గుర్రం గూడా 6వ డివిజన్, 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్లు దడిగ శంకర్ మరియు గడ్డం లక్ష్మా రెడ్డి ల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గుర్రం గూడా లోని వివిధ కాలనీ వాసులతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు…ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ఆవేదనను శ్రీరాములు తో వ్యక్తపరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని దాని కొరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు విలీనానికి వ్యతిరేకంగా కాలనీవాసులందరూ తమ సంతకాలను చేసి కార్పొరేటర్లకు అందించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ పార్టీలకతీతంగా మన ప్రాంతం కొరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని మీ యొక్క సూచనలను అభిప్రాయాలను తీసుకునేందుకే ఈ సమీక్ష సమావేశం నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించేదాకా సమిష్టిగా పోరాడుదామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి, రాళ్ల గూడెం రామకృష్ణా రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన, బిజెపి సీనియర్ నాయకులు జంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్చల భాస్కర్ రెడ్డి, వివిధ కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాలనీవాసులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

* చార్మినార్ జోన్ మాకొద్దని ఆగ్రహిస్తున్న కాలనీ వాసులు –సమిష్టిగా పోరాడి మన ప్రాంతాన్ని కాపాడుకుందాం.. శ్రీరాములు అందెల*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : బడంగ్ పేట్ కార్పొరేషన్ ను సౌత్ సౌత్ జోన్ లో ఉన్నటువంటి చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గుర్రం గూడా 6వ డివిజన్, 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్లు దడిగ శంకర్ మరియు గడ్డం లక్ష్మా రెడ్డి ల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గుర్రం గూడా లోని వివిధ కాలనీ వాసులతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు…ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ఆవేదనను శ్రీరాములు తో వ్యక్తపరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని దాని కొరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు విలీనానికి వ్యతిరేకంగా కాలనీవాసులందరూ తమ సంతకాలను చేసి కార్పొరేటర్లకు అందించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ పార్టీలకతీతంగా మన ప్రాంతం కొరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని మీ యొక్క సూచనలను అభిప్రాయాలను తీసుకునేందుకే ఈ సమీక్ష సమావేశం నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించేదాకా సమిష్టిగా పోరాడుదామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి, రాళ్ల గూడెం రామకృష్ణా రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన, బిజెపి సీనియర్ నాయకులు జంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్చల భాస్కర్ రెడ్డి, వివిధ కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాలనీవాసులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

