క్షత్రియ వనభోజన .
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 09 ( పున్నమి న్యూస్ ప్రతినిధి/ సింగమాల వెంకటేష్ ) రాజంపేట డివిజన్ పొలపత్తూరులో టిడిపి రాజంపేట అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగే క్షత్రియ వనభోజన కార్యక్రమానికి రైల్వే కోడూరు క్షత్రియ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సంగరాజు రవికుమార్ రాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో, రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ సమీపాన ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, రాజంపేటకు వేలాదిగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రైల్వే కోడూరు నియోజకవర్గ క్షత్రియ సంఘం నాయకులు సంగ రాజకుమార్ రాజు మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు దేశానికి గర్వకారకమని పేర్కొన్నారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగే కార్తీక వనభోజన కార్యక్రమానికి రైల్వే కోడూరు నుంచి 2000 మందికి పైగా క్షత్రియులు రాష్ట్రం నాలుమూలల నుండి 20 నుండి 30,000 దాకా హాజరు కాబోతున్నారని క్షత్రియులమంతా ఒక తాటిపై నిలిచి జగన్మోహన్ రాజు నాయకత్వాన్ని బలపరుస్తామని క్షత్రియులమంతా ఐక్యంగా నిలబడి ముందుకు సాగుతామని తెలిపారు కార్యక్రమంలో పలువురు క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.


