*జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ*
కడియం మండలం జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి జాతీయ జెండాతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఆగస్ట్ 15 వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ,ఉపసర్పంచ్ పాతూరి రాజేష్,మాజీ ఎంపీటీసీ మర్రెడి రమేష్ జనసేన నాయకులు కర్రి చినబాబు, గ్రామ పెద్దలు, సచివాలయ,అంగనవాడీ తదితర ఉద్యోగులు,గ్రామస్థులు పాల్గొన్నారు.


