యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( TSLDA)లో పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, బొందుగుల గ్రామానికి చెందిన అమరాజు.పరుషరాములు (గోపాలమిత్ర) వయస్సు 50 సంవత్సరాలు.జూలై 28 సోమవారం రోజున అనారోగ్యంతో చనిపోయాడు.యాదాద్రి భువనగిరి జిల్లాలో పని చేస్తున్న 63 మంది గోపాల మిత్రులు,5 గురు మైత్రిలు అందరు కలిసి తన కుటుంబానికి 68,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వంగూరి గోవింద్,జిల్లా అధ్యక్షులు.పులెపాక రాములు,ఉప అధ్యక్షులు కంకల మల్లేశం, జిల్లా సలహాదారు బర్మా.రాంచందర్ ,ప్రధాన కార్యదర్శి రేగు బాలరాజు, రాష్ట్ర ఉప అధ్యక్షులు సట్టు బాలకిషన్, కమిటీ మెంబర్ శికిలం.కుమారస్వామి,గోపాల మిత్రులు సుధాకర్, మైత్రి మెరుగు స్వామి, ముత్తయ్య,కొమురయ్య, శ్రీకాంత్, వేణు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


