శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) కిసాన్ కాంగ్రెస్ పార్టీ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో రైతులకు ఘన సత్కారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు సమక్షంలో, తిరుపతి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొమ్మిది మంది రైతులను శాలువాలతో సత్కరించి వారి సేవలను గుర్తించారు. సత్కారం పొందిన వారిలో పి. ముని కృష్ణయ్య, ఎం. దొరవేలు, దయానందయ్య, పీ. పొల్లయ్య, సీ. మంగయ్య, వి. మునిస్వామి, ఎం. వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కే. జనార్దన్ రెడ్డి, కూలి రవికుమార్, ఎం. వెంకట ముని, ఎం. వడివేలు మొదలియార్, ఇర్ల గోపి, శెట్టిపల్లి శివ, ఎస్. నాగూర్ అయ్యా, బి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

91వ సంవత్సరంలోకి కిసాన్ కాంగ్రెస్.. 9 మంది రైతులకు సన్మానం
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) కిసాన్ కాంగ్రెస్ పార్టీ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో రైతులకు ఘన సత్కారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు సమక్షంలో, తిరుపతి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొమ్మిది మంది రైతులను శాలువాలతో సత్కరించి వారి సేవలను గుర్తించారు. సత్కారం పొందిన వారిలో పి. ముని కృష్ణయ్య, ఎం. దొరవేలు, దయానందయ్య, పీ. పొల్లయ్య, సీ. మంగయ్య, వి. మునిస్వామి, ఎం. వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కే. జనార్దన్ రెడ్డి, కూలి రవికుమార్, ఎం. వెంకట ముని, ఎం. వడివేలు మొదలియార్, ఇర్ల గోపి, శెట్టిపల్లి శివ, ఎస్. నాగూర్ అయ్యా, బి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

