తొట్టంబేడు, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) తొట్టంబేడుమండల పరిధిలోని పెద్దకనపర్తి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ‘పూలే – అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పాల’ చెంత ఈ కార్యక్రమం జరిగింది. పూలే – అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపక కార్యదర్శి ఎన్. చలపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అక్షరాస్యత కోసం పూలే చేసిన సామాజిక పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూలే – అంబేడ్కర్ అధ్యయన కేంద్రం కార్యదర్శి పల్లమాల సురేష్, బుడ్డా వెంకటస్వామి, పోతురాజు, కృష్ణయ్య, పల్లమాల వెంకటేశ్వరరావు, బుడ్డా గురవయ్య, పల్లమాల శ్రీనివాస్, చెమూరు రత్నయ్య, వర్మ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దకనపర్తిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
తొట్టంబేడు, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) తొట్టంబేడుమండల పరిధిలోని పెద్దకనపర్తి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ‘పూలే – అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పాల’ చెంత ఈ కార్యక్రమం జరిగింది. పూలే – అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపక కార్యదర్శి ఎన్. చలపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అక్షరాస్యత కోసం పూలే చేసిన సామాజిక పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూలే – అంబేడ్కర్ అధ్యయన కేంద్రం కార్యదర్శి పల్లమాల సురేష్, బుడ్డా వెంకటస్వామి, పోతురాజు, కృష్ణయ్య, పల్లమాల వెంకటేశ్వరరావు, బుడ్డా గురవయ్య, పల్లమాల శ్రీనివాస్, చెమూరు రత్నయ్య, వర్మ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

