నెల్లూరు @ మే 7
చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీ శ్రీ కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ నందు జరిగే శ్రీ శ్రీ కళావేదిక 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. గురువారం కార్యక్రమాలు తెలిపే పోస్టర్ను నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కవులు, కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా శ్రీ శ్రీ కళావేదిక నిరంతర సాహిత్య సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళా వేదిక నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు, మరియు సాహిత్య సభల సమన్వయకర్తలు డా. పులి చంచయ్య, గురుకుల ప్రిన్సిపాల్ దుప్పటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహా సభలను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు @ మే 7 చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీ శ్రీ కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ నందు జరిగే శ్రీ శ్రీ కళావేదిక 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. గురువారం కార్యక్రమాలు తెలిపే పోస్టర్ను నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కవులు, కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా శ్రీ శ్రీ కళావేదిక నిరంతర సాహిత్య సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళా వేదిక నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు, మరియు సాహిత్య సభల సమన్వయకర్తలు డా. పులి చంచయ్య, గురుకుల ప్రిన్సిపాల్ దుప్పటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

