ఖమ్మం ఆగష్టు 9
(పున్నమి న్యూస్)
ఖమ్మం నగరంలోని నిర్మల్ హృదయ్ పాఠశాల అధినేత వంగ సాంబశివరెడ్డి గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి పట్ల విద్యారంగానికి చెందిన పలువురు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి సాంబశివరెడ్డి చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తీరని లోటుగా మారిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని పలువురు సంతాపం తెలిపారు.


