*సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం, అశోక్ పిల్లర్ వాకాడు,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,*
వాకాడు: బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు పెంచినందుకు బుధవారం సాయంత్రం వాకాడలో టిడిపి ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అశోక పిల్లర్ సెంటర్ వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టిడిపి నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని టిడిపి నాయకులు నీటి సంఘ అధ్యక్షులు సీనా రెడ్డి, బత్తిన ప్రమీల, సురేష్ , వేము దినకర బాబు, గోపి నాయుడు, షేక్ రహమతుల్లా, కావలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.



