(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) ఆగస్టు 01 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
అవ్వ తాతలకు ఆర్థిక భరోసా ఇస్తున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు
నాయుడుపేట పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్.రఫీ
కూటమి ప్రభుత్వం ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటవ తేదీ ఉదయం 6 గంటలకే పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పేదలకు,అవ్వ తాతలకు ఆర్థిక భరోసాకల్పిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ,అధ్యక్షులు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ,కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు నాయుడుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందని వారి వివరాలను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ల దృష్టికి తీసుకువెళ్లి వారికి పింఛన్లు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు



