భారత్లో దాదాపు 10 కోట్ల మంది మధుమేహంతో,మరో 13 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్తో ఉన్నట్లు ICMR-INDIAB అధ్యయనం వెల్లడించింది. మధుమేహం శరీరంలోని దాదాపు అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది.అయితే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు.షుగర్ను కుక్కతో పోల్చవచ్చు. అదుపులో ఉంటే ‘బొచ్చు కుక్క’లా హాని చేయదు. నిర్లక్ష్యం చేస్తే ‘పిచ్చి కుక్క’లా మారి గుండె, కిడ్నీలు, కళ్లు,నరాలు వంటి ముఖ్య అవయవాలను దెబ్బతీస్తుంది.అందుకే సకాలంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి.వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తూ, బరువును నియంత్రించుకోవాలి.చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తూ క్రమశిక్షణతో జీవిస్తే మధుమేహం వల్ల వచ్చే తీవ్రమైన సమస్యలను చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

షుగర్ అదుపులో ఉంటే బొచ్చు కుక్క — అదుపులో లేకపోతే పిచ్చి కుక్క!
భారత్లో దాదాపు 10 కోట్ల మంది మధుమేహంతో,మరో 13 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్తో ఉన్నట్లు ICMR-INDIAB అధ్యయనం వెల్లడించింది. మధుమేహం శరీరంలోని దాదాపు అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది.అయితే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు.షుగర్ను కుక్కతో పోల్చవచ్చు. అదుపులో ఉంటే ‘బొచ్చు కుక్క’లా హాని చేయదు. నిర్లక్ష్యం చేస్తే ‘పిచ్చి కుక్క’లా మారి గుండె, కిడ్నీలు, కళ్లు,నరాలు వంటి ముఖ్య అవయవాలను దెబ్బతీస్తుంది.అందుకే సకాలంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి.వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తూ, బరువును నియంత్రించుకోవాలి.చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తూ క్రమశిక్షణతో జీవిస్తే మధుమేహం వల్ల వచ్చే తీవ్రమైన సమస్యలను చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

