పీరా రామచంద్రాపురం, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): పీరా రామచంద్రాపురం సింగరాయకాలనీలో శ్రీ విజయదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యేతో పాటు అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, పీరా రామచంద్రాపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.


