ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఏప్రిల్ 29 (పున్నమి ప్రతినిధి):
మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ శివ రాకేష్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఊరికి వెళ్లే వారు ముందుగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ముందస్తుగా తెలియజేస్తే ఇళ్ల భద్రత కోసం గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. పిల్లలు చెరువులు, గుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులతో సహకరించి భద్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.


