*వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా*
తిరుమల, (సెప్టెంబర్ 5):-
*తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు దేవినేని ఉమా తెలిపారు.*




