Monday, 7 September 2026
  • Home  
  • రెడ్డమ్మ ఆలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం
- తిరుపతి

రెడ్డమ్మ ఆలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రెడ్డమ్మ దేవత ఆలయ అభివృద్ధి పనులకు రూ.25 వేల విరాళం అందింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులకు సహకరించేందుకు వైఎస్సార్ కడప జిల్లా కోఆపరేటివ్ కాలనీకి చెందిన ఎం. భాస్కర్ రెడ్డి విరాళాన్ని అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. విరాళ మొత్తాన్ని వాయల్పాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులోని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొంటూ ఆలయ చైర్మన్ శ్రీలంకిపల్లి రాజన్న నాయుడు, ఈఓ మంజుల కృతజ్ఞతలు తెలిపారు.

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రెడ్డమ్మ దేవత ఆలయ అభివృద్ధి పనులకు రూ.25 వేల విరాళం అందింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులకు సహకరించేందుకు వైఎస్సార్ కడప జిల్లా కోఆపరేటివ్ కాలనీకి చెందిన ఎం. భాస్కర్ రెడ్డి విరాళాన్ని అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. విరాళ మొత్తాన్ని వాయల్పాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులోని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొంటూ ఆలయ చైర్మన్ శ్రీలంకిపల్లి రాజన్న నాయుడు, ఈఓ మంజుల కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.