రఘునాథపాలెం / ఖమ్మం
రఘునాథపాలెం మండలం జింకలతండ గ్రామం వద్ద శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, భారతదేశ ఔన్నత్యం, విలువలను ప్రపంచానికి చాటేలా స్వామి నారాయణ గురుకుల పాఠశాల పనిచేస్తోందన్నారు. సంస్కారవంతమైన విద్యతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. ప్రపంచానికి సంస్కారం చాటి చెప్పిన భారతదేశంలో ఆ విలువలను పరిరక్షించేందుకు స్వామి నారాయణ సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఖమ్మంలో పాఠశాల ఏర్పాటు జిల్లా విద్యార్థులకు వరమన్నారు. పాఠశాలకు ప్రభుత్వ స్థలం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.



