నంద్యాల: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవనోపాధి, ప్రవర్తనపై ఆరా తీశారు.చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

రౌడీషీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి: నంద్యాల పోలీస్ హెచ్చరిక
నంద్యాల: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవనోపాధి, ప్రవర్తనపై ఆరా తీశారు.చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

