రైతులను లాకప్లో వేసి కొట్టడం అమానుషం : కాకాణి
సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి మోటార్లకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అవినీతి, రాజకీయ జోక్యం జరుగుతోందని మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ ఎస్ఈను కలిసి రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. పొదలకూరు ఏఈఈ లంచాలు తీసుకుంటూ అధికార పార్టీ సిఫార్సులు ఉన్నవారికే కనెక్షన్లు ఇస్తున్నారని విమర్శించారు. కనెక్షన్ కోరిన రైతులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కొట్టడం అమానుషమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని కాకాణి స్పష్టం చేశారు.

రైతులను లాకప్లో వేసి కొట్టడం అమానుషం : కాకాణి
రైతులను లాకప్లో వేసి కొట్టడం అమానుషం : కాకాణి సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి మోటార్లకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అవినీతి, రాజకీయ జోక్యం జరుగుతోందని మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ ఎస్ఈను కలిసి రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. పొదలకూరు ఏఈఈ లంచాలు తీసుకుంటూ అధికార పార్టీ సిఫార్సులు ఉన్నవారికే కనెక్షన్లు ఇస్తున్నారని విమర్శించారు. కనెక్షన్ కోరిన రైతులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కొట్టడం అమానుషమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని కాకాణి స్పష్టం చేశారు.

