ఖమ్మం: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటన వివరాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం రూరల్ మండలంలోని ఎం. వెంకటాయపాలెం, 2.20 గంటలకు ఖమ్మంలోని శ్రీరాం హిల్స్కు చేరుకుంటారు. సాయంత్రం 5.10 గంటలకు ఖమ్మం కొత్తకొండాయగూడెం 1 వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5.30 గంటలకు దానవాయిగూడెం 59వ డివిజన్లో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 5.50 గంటలకు ఏదులాపురం, 6.10 గంటలకు వరంగల్ క్రాస్రోడ్లో పర్యటిస్తారు. రాత్రి 8.30 గంటలకు స్వర్ణభారతి కళ్యాణమండపం, 8.50 గంటలకు కిరణ/, జాగిర్ మార్చంట్స్
పాల్గొంటారు అని పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయకర్ రెడ్డి తెలిపారు



