రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరంలో “ఎస్” టీవీ (సుమన్ టీవీ) రాజమహేంద్రవరం బ్రాంచ్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నల్లమిల్లి, సుమన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రజలకు వాస్తవాలను అందిస్తూ విశ్వసనీయమైన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
సమాజ శ్రేయస్సు, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
సుమన్ టీవీ రాజమహేంద్రవరం బ్రాంచ్ మరింత అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ పాల్గొన్నారు.
ఆళ్ళ గోవింద్ కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.



