ముమ్మిడివరం,ఆగస్టు 13,( పున్నమి ప్రతినిధి )
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ముమ్మిడివరం, కాట్రేనికోన,ఐ పోలవరం,తాళ్ళరేవు మండలాల్లో తెలుగుదేశం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సూచనల మేరకు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటా సర్వే గురించి మరియు మెగా డీఎస్సీ పై వైసీపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే అంశంపై పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్యాడర్ సమన్వయం, ప్రజా సమస్యలపై స్పందన మరియు పలు కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, నాయకులు,కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని నాయకులు సూచించారు.


