డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతి కమిషనర్ శ్రీ పి.రవి వర్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంద్ర, స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతి కార్యాలయం వద్ద పారిశుధ్యం,పరిశుభ్రత అనే భావనతో స్వచ్చ ఆంద్ర,స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కమిషనర్ రవి వర్మ మాట్లాడుతూ స్వచ్చ ముమ్మిడివరం సాధించాలంటే ప్రజలు చాలా కీలకమని, మన ఊరు, మన భాద్యతగా స్వచ్చమైన మరియు పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనమందరం భాగస్వాములవ్వాలని, తడి,పొడి చెత్తను వేరుచేసి స్వచ్ఛత వైపు అడుగులు వేద్దాం అన్నారు. వర్షాకాలములో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం ప్రజలలో అవగాహన కల్పించుటకుపై అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయుటకు ప్రజలు ఎంతో సహకరించాలని, మెప్మా సిబ్బంది చాల కష్టపడి విధులు నిర్వర్తిస్తున్నారని, స్వచ్చ సర్వేక్షన్ టీం పర్యవేక్షణలో శానిటేషన్ సిబ్బంది సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎ.ఇ. కె.శ్రీనివాసు, సి.ఎం.ఎం. ఎస్.భాష్కర్, ఎస్.ఐ. జి.రాజీవ్ గాంధీ, ఎస్.హెచ్.జి.మెంబర్స్ , సచివాలయ సెక్రటరీలు , మెప్మా మరియు నగర పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మిడివరం నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతి కమిషనర్ శ్రీ పి.రవి వర్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంద్ర, స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతి కార్యాలయం వద్ద పారిశుధ్యం,పరిశుభ్రత అనే భావనతో స్వచ్చ ఆంద్ర,స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కమిషనర్ రవి వర్మ మాట్లాడుతూ స్వచ్చ ముమ్మిడివరం సాధించాలంటే ప్రజలు చాలా కీలకమని, మన ఊరు, మన భాద్యతగా స్వచ్చమైన మరియు పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనమందరం భాగస్వాములవ్వాలని, తడి,పొడి చెత్తను వేరుచేసి స్వచ్ఛత వైపు అడుగులు వేద్దాం అన్నారు. వర్షాకాలములో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం ప్రజలలో అవగాహన కల్పించుటకుపై అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయుటకు ప్రజలు ఎంతో సహకరించాలని, మెప్మా సిబ్బంది చాల కష్టపడి విధులు నిర్వర్తిస్తున్నారని, స్వచ్చ సర్వేక్షన్ టీం పర్యవేక్షణలో శానిటేషన్ సిబ్బంది సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎ.ఇ. కె.శ్రీనివాసు, సి.ఎం.ఎం. ఎస్.భాష్కర్, ఎస్.ఐ. జి.రాజీవ్ గాంధీ, ఎస్.హెచ్.జి.మెంబర్స్ , సచివాలయ సెక్రటరీలు , మెప్మా మరియు నగర పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

