ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయ మండలంలోని గన్నెల పీహెచ్సీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న సంజీవని కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమాణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సమన్వయంతో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమ ప్రాంగణం, వేదిక, పార్కింగ్, భద్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి అరకు పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష
ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయ మండలంలోని గన్నెల పీహెచ్సీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న సంజీవని కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమాణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సమన్వయంతో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమ ప్రాంగణం, వేదిక, పార్కింగ్, భద్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

