ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 21 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బీసీ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పొదలకూరు సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో పొదలకూరు ఎస్సై శివరాకేష్, మనుబోలు ఎస్సై మహమ్మద్ హనీఫ్, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కాలనీలోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. ఇళ్ల యజమానులు అద్దెకు ఇచ్చే వ్యక్తుల ఆధార్ వివరాలను తప్పనిసరిగా సేకరించి పోలీసులకు అందించాలని ఎస్సై సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

మనుబోలు బీసీ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 21 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బీసీ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పొదలకూరు సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో పొదలకూరు ఎస్సై శివరాకేష్, మనుబోలు ఎస్సై మహమ్మద్ హనీఫ్, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కాలనీలోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. ఇళ్ల యజమానులు అద్దెకు ఇచ్చే వ్యక్తుల ఆధార్ వివరాలను తప్పనిసరిగా సేకరించి పోలీసులకు అందించాలని ఎస్సై సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

