తెలంగాణ విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు శ్రీ రామచందర్ రావు గారు 23 మరియు 24 తేదీల్లో చేపట్టబోయే నిరాహార దీక్ష సందర్భంగా, మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ గిరి వర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో BJYM జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా BJYM నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, విద్యార్థుల హక్కుల కోసం జరుగుతున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగా సోమవారం నాంపల్లి రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో BJYM నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Regards,
Ravula prudhvi kumar
BJYM, Medchal–Malkajgiri


