నంద్యాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నంది కేబుల్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వాసు, ఈనాడు దినపత్రిక నంద్యాల ఫోటోగ్రాఫర్ మురళికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ డాక్టర్ జి. రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ చరిత్రను భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసే గొప్ప కళ అని అన్నారు. పాత్రికేయ రంగంలో వాసు, మురళి అందిస్తున్న సేవలను అభినందించారు.కార్యక్రమంలో జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు, కార్యదర్శి మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్, సభ్యులు ఎం.పి.వి. రమణయ్య, తోట శ్రీనివాసులు, శివరాం రెడ్డి, రామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వాసు, మురళికి పురస్కారాలు
నంద్యాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నంది కేబుల్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వాసు, ఈనాడు దినపత్రిక నంద్యాల ఫోటోగ్రాఫర్ మురళికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ డాక్టర్ జి. రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ చరిత్రను భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసే గొప్ప కళ అని అన్నారు. పాత్రికేయ రంగంలో వాసు, మురళి అందిస్తున్న సేవలను అభినందించారు.కార్యక్రమంలో జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు, కార్యదర్శి మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్, సభ్యులు ఎం.పి.వి. రమణయ్య, తోట శ్రీనివాసులు, శివరాం రెడ్డి, రామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

