Monday, 25 May 2026
  • Home  
  • పీలేరులో ‘మహానాడు’ జోష్‌.. వర్చువల్ ఏర్పాట్లపై రాష్ట్ర కార్యదర్శి సుదీర్ఘ చర్చ
- తిరుపతి

పీలేరులో ‘మహానాడు’ జోష్‌.. వర్చువల్ ఏర్పాట్లపై రాష్ట్ర కార్యదర్శి సుదీర్ఘ చర్చ

శ్రీ కాళహస్తి, మే 25, (పున్నమి న్యూస్): తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘మహానాడు’ పండుగను పీలేరు నియోజకవర్గంలో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు ఎం. సుబ్బయ్య పిలుపునిచ్చారు. ఈసారి మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో వర్చువల్ ప్రోగ్రామ్స్‌ ద్వారా క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, నియోజకవర్గంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయన పీలేరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ వర్చువల్ మహానాడు కార్యక్రమాలకు హాజరయ్యే మండల నాయకులు, యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు, బూత్ కన్వీనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సుబ్బయ్య సూచించారు. క్లస్టర్ల వారీగా వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక వసతులు, ఇతర ఏర్పాట్లను ఏ విధంగా సమకూర్చాలనే అంశాలపై మండల అధ్యక్షుడికి ఆయన దిశా నిర్దేశం చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తను ఈ మహానాడులో భాగస్వామ్యం చేయడమే మన లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు.

శ్రీ కాళహస్తి, మే 25, (పున్నమి న్యూస్): తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘మహానాడు’ పండుగను పీలేరు నియోజకవర్గంలో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు ఎం. సుబ్బయ్య పిలుపునిచ్చారు. ఈసారి మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో వర్చువల్ ప్రోగ్రామ్స్‌ ద్వారా క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, నియోజకవర్గంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయన పీలేరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ వర్చువల్ మహానాడు కార్యక్రమాలకు హాజరయ్యే మండల నాయకులు, యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు, బూత్ కన్వీనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సుబ్బయ్య సూచించారు. క్లస్టర్ల వారీగా వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక వసతులు, ఇతర ఏర్పాట్లను ఏ విధంగా సమకూర్చాలనే అంశాలపై మండల అధ్యక్షుడికి ఆయన దిశా నిర్దేశం చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తను ఈ మహానాడులో భాగస్వామ్యం చేయడమే మన లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.