శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)-2026’ కార్యక్రమం ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేని విధంగా రూపొందించేందుకు ఉద్దేశించిన కీలక ప్రక్రియ అని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీవో భానుప్రకాష్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని 294 పోలింగ్ బూత్ల పరిధిలో బీఎల్ఓలు, పార్టీ బీఎల్ఏలు నిర్వహించాల్సిన బాధ్యతలు, విధులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా పాల్గొన్న టీడీపీ నాయకులు ‘సర్-2026’ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను తెలుసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను సూచించారు. ఓటర్ల జాబితాలోని తప్పొప్పులను సరిదిద్దడం, అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా విశ్వసనీయమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, రాష్ట్ర ప్రతినిధులు మిన్నల్ రవి, ఎం. సుబ్బయ్య, డా. ఎం. ఉమేష్ రావు, షేక్ ఖాదర్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పారదర్శక ఓటర్ల జాబితా కోసం ‘సర్-2026’కు సహకరించాలి
శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)-2026’ కార్యక్రమం ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేని విధంగా రూపొందించేందుకు ఉద్దేశించిన కీలక ప్రక్రియ అని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీవో భానుప్రకాష్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని 294 పోలింగ్ బూత్ల పరిధిలో బీఎల్ఓలు, పార్టీ బీఎల్ఏలు నిర్వహించాల్సిన బాధ్యతలు, విధులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా పాల్గొన్న టీడీపీ నాయకులు ‘సర్-2026’ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను తెలుసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను సూచించారు. ఓటర్ల జాబితాలోని తప్పొప్పులను సరిదిద్దడం, అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా విశ్వసనీయమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, రాష్ట్ర ప్రతినిధులు మిన్నల్ రవి, ఎం. సుబ్బయ్య, డా. ఎం. ఉమేష్ రావు, షేక్ ఖాదర్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

