Thursday, 4 June 2026
  • Home  
  • నేడు నగరవనంలో పర్యావరణ దినోత్సవం-‘సీడ్ బాల్స్’ కార్యక్రమం
- తిరుపతి

నేడు నగరవనంలో పర్యావరణ దినోత్సవం-‘సీడ్ బాల్స్’ కార్యక్రమం

శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సీడ్ బాల్స్’ (విత్తన బంతులు) ద్వారా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని నగరవనంలో వర్చువల్ విధానం ద్వారా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణ, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగే ఈ వినూత్న హరిత యజ్ఞంలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని స్థానిక జనసేన నేతలు పిలుపునిచ్చారు. నేడు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై, మొక్కలు నాటే ప్రక్రియను విజయవంతం చేయాలని జనసైనికులు కోరారు.

శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సీడ్ బాల్స్’ (విత్తన బంతులు) ద్వారా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని నగరవనంలో వర్చువల్ విధానం ద్వారా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణ, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగే ఈ వినూత్న హరిత యజ్ఞంలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని స్థానిక జనసేన నేతలు పిలుపునిచ్చారు. నేడు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై, మొక్కలు నాటే ప్రక్రియను విజయవంతం చేయాలని జనసైనికులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.