ఆత్మకూరు:
కూటమి ప్రభుత్వం రెండేళ్లయినా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేదని మేకపాటి విక్రమ్రెడ్డి సూచనలతో టీడీపీ మేనిఫెస్టో ప్రతుల దహనం
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ డిపో, ఎల్ఆర్పల్లి, పోలీస్స్టేషన్ రోడ్ మీదుగా సోమశిల రోడ్ సెంటర్కు చేరుకుంది.

వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీ
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్లయినా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేదని మేకపాటి విక్రమ్రెడ్డి సూచనలతో టీడీపీ మేనిఫెస్టో ప్రతుల దహనం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ డిపో, ఎల్ఆర్పల్లి, పోలీస్స్టేషన్ రోడ్ మీదుగా సోమశిల రోడ్ సెంటర్కు చేరుకుంది.

