శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కొప్పెర్ల నాగరాజు గురువారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉదయం తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, సమితి నాయకులు డి. కృష్ణమూర్తి, గంగనపల్లి రమేష్ తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కొప్పెర్ల నాగరాజు ఆలయ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు
శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కొప్పెర్ల నాగరాజు గురువారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉదయం తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, సమితి నాయకులు డి. కృష్ణమూర్తి, గంగనపల్లి రమేష్ తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కొప్పెర్ల నాగరాజు ఆలయ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

