ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో “SIR సత్తుపల్లి మండల ప్రవాస్ అభియాన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రభారి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. BLO-2ల పనితీరు, పోలింగ్ బూత్లు, ఓటరు జాబితా, బూత్ కమిటీలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రవాస్ అభియాన్లో భాగంగా కృష్ణాపురంలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టి గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



