ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో బీజేపీ వైపు ఆకర్షణ పెరుగుతోంది. రాచవారిపల్లికి చెందిన నంబూరి రోషిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు లెక్కల వెంగళరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.వంశీధర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు రోషిరెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. “సబ్కా సాథ్–సబ్కా వికాస్–సబ్కా విశ్వాస్” నినాదంతో దుత్తలూరులో బీజేపీ బలపడుతోందన్నారు.

దుత్తలూరులో బీజేపీకి భారీగా చేరికలు.. వైసీపీ నుంచి 50 కుటుంబాలు
ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో బీజేపీ వైపు ఆకర్షణ పెరుగుతోంది. రాచవారిపల్లికి చెందిన నంబూరి రోషిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు లెక్కల వెంగళరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.వంశీధర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు రోషిరెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. “సబ్కా సాథ్–సబ్కా వికాస్–సబ్కా విశ్వాస్” నినాదంతో దుత్తలూరులో బీజేపీ బలపడుతోందన్నారు.

