దగదర్తి మండలం దుండిగం గ్రామానికి చెందిన కాపా దామోదర్ నాయుడు (చిట్టిబాబు) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి హాజరై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దామోదర్ నాయుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రవికుమార్ చౌదరి దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. దామోదర్ నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై దామోదర్ నాయుడికి కన్నీటి నివాళులు అర్పించారు.

దామోదర్ అంత్యక్రియల్లో పాల్గొన్న మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి
దగదర్తి మండలం దుండిగం గ్రామానికి చెందిన కాపా దామోదర్ నాయుడు (చిట్టిబాబు) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి హాజరై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దామోదర్ నాయుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రవికుమార్ చౌదరి దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. దామోదర్ నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై దామోదర్ నాయుడికి కన్నీటి నివాళులు అర్పించారు.

