Saturday, 8 August 2026
  • Home  
  • *తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠా అరెస్ట్.*
- తిరుపతి

*తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠా అరెస్ట్.*

ఆరుగురు నిందితులు అరెస్ట్. – నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, సెల్‌ఫోన్లు స్వాధీనం. – పోలీసు–టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా ప్రత్యేక నిఘా, చర్యలు. – రూమ్ దళారీలను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచన. తిరుమల, ఆగస్టు 08 పున్నమి ప్రతినిధి తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ, వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. *తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్.,* గార్ల ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీసు మరియు విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆగస్టు 08న ఉదయం తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది. అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదేవిధంగా, తిరుమలలోని PAC-5 వద్ద భక్తులు ఛార్జింగ్‌కు ఉంచిన సెల్‌ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20) అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో భాగంగా ఈ నెల 06న తెల్లవారుజామున తిరుమల PAC-5 వద్ద దొంగతనం చేసిన రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు మరియు అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులు లేదా ఇతర గుర్తింపు పత్రాల ద్వారా గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. రూమ్ దళారీల కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా భక్తులను మోసం చేసే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే పోలీసు అత్యవసర సేవ 112 లేదా సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. భక్తుల భద్రత, సౌకర్యం మరియు తిరుమలలో పారదర్శకమైన సేవల పరిరక్షణకు పోలీసు మరియు టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

ఆరుగురు నిందితులు అరెస్ట్.

– నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, సెల్‌ఫోన్లు స్వాధీనం.

– పోలీసు–టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా ప్రత్యేక నిఘా, చర్యలు.

– రూమ్ దళారీలను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచన.

తిరుమల, ఆగస్టు 08 పున్నమి ప్రతినిధి

తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ, వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
*తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్.,* గార్ల ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీసు మరియు విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆగస్టు 08న ఉదయం తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది.
అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అదేవిధంగా, తిరుమలలోని PAC-5 వద్ద భక్తులు ఛార్జింగ్‌కు ఉంచిన సెల్‌ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనకు సంబంధించి బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20) అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో భాగంగా ఈ నెల 06న తెల్లవారుజామున తిరుమల PAC-5 వద్ద దొంగతనం చేసిన రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు మరియు అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు.
నకిలీ ఆధార్ కార్డులు లేదా ఇతర గుర్తింపు పత్రాల ద్వారా గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. రూమ్ దళారీల కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా భక్తులను మోసం చేసే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే పోలీసు అత్యవసర సేవ 112 లేదా సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
భక్తుల భద్రత, సౌకర్యం మరియు తిరుమలలో పారదర్శకమైన సేవల పరిరక్షణకు పోలీసు మరియు టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.