ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి సనత్ కుమార్ వినూత్న కళాఖండాన్ని రూపొందించారు. పుస్తకంపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రూపం ప్రతిబింబించేలా ఇసుకతో శిల్పాన్ని తీర్చిదిద్దారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే గురువులకు కృతజ్ఞతగా ఈ కళారూపాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. శిల్పం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Uploaded Video:


