కనీస వేతనాలు పెంచకుండా కార్మికులపై శ్రమభారం మోపేలా రోజుకు రెండు పని గంటలు అదనంగా పెంచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ప్రభుత్వం వహించిన ఆమోదం ప్రజా వ్యతిరేక విథానమని పౌర సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులకు రక్షణ కరువైన రోజుల్లో రాత్రి షిఫ్టుల్లో పని చేయాలనడం మహిళల భద్రతకు పెను ముప్పుగా ఉంటుందన్నారు. కార్మిక శ్రేయస్సు కోసం విధానాలు మార్పు చేయాలన్నారు.8 గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి సాథించుకున్న హక్కు కాగా ఏపి లో 10గంటల పని వేళలు పెంపు చేయడం మంచి పరిణామం కాదన్నారు. కార్మిక వ్యతిరేకత వలన ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుందన్నారు. మూడుపార్టీల కూటమి లో ముప్పు వాటిల్లే నిర్ణయాలు వహించడం ముదావహం కాదన్నారు.

కార్మికులపై అదనపు పనిభారం తగదు.. ఏపి నిర్ణయం ఉపసంహరించాలి
కనీస వేతనాలు పెంచకుండా కార్మికులపై శ్రమభారం మోపేలా రోజుకు రెండు పని గంటలు అదనంగా పెంచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ప్రభుత్వం వహించిన ఆమోదం ప్రజా వ్యతిరేక విథానమని పౌర సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులకు రక్షణ కరువైన రోజుల్లో రాత్రి షిఫ్టుల్లో పని చేయాలనడం మహిళల భద్రతకు పెను ముప్పుగా ఉంటుందన్నారు. కార్మిక శ్రేయస్సు కోసం విధానాలు మార్పు చేయాలన్నారు.8 గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి సాథించుకున్న హక్కు కాగా ఏపి లో 10గంటల పని వేళలు పెంపు చేయడం మంచి పరిణామం కాదన్నారు. కార్మిక వ్యతిరేకత వలన ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుందన్నారు. మూడుపార్టీల కూటమి లో ముప్పు వాటిల్లే నిర్ణయాలు వహించడం ముదావహం కాదన్నారు.

