ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చావా ప్రణీత్ ఎంపికయ్యారు. జనవరి 3, 4, 5 తేదీల్లో శంషాబాద్లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు చావా ప్రణీత్కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.



