భైంసా, ఆగస్టు 13: పున్నమీ ప్రతినిధి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో **జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేర్మెన్ డా. అనిల్ కుమార్ గారు & కృష్ణా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్* ఆధ్వర్యంలో సూర్యాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో గ్రామానికి చెందిన 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వైద్యులు ప్రజల ఆరోగ్య సమస్యలను స్వయంగా పరిశీలించి, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా *డాక్టర్ హేమంత్ కళ్యాణ్* మాట్లాడుతూ.. పేద, గ్రామీణ ప్రజలకు వైద్యం భారంగా మారకూడదనే ఉద్దేశంతో జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ క్, రాజన్న గారు,RMP. రాజన్న గారు గ్రామ పంచాయతీ సెక్యూరిటీ రాజు వైద్యులు, గ్రామ పెద్దలు, జీడీఆర్ ట్రస్ట్ సభ్యులు రఘు వీర్ గారు, PRO చంద్రభూషణ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా..సేవే మార్గంగా.. జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు సాగుతోంది.

