ఏఎస్పేట మండల కేంద్రంలోని తూర్పు వీధి సాయిబాబా గుడి వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగం సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఏఎస్పేట ఎస్ఐ జిలానీ భాష, సంగం ఎస్ఐ భోజ్యనాయక్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో 25 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు భద్రతా చర్యలు, చట్టాలపై పలు సూచనలు, సలహాలు అందజేశారు.



