ఒడిశాకు చెందిన 17 ఏళ్ల గిరిజన బాలికను ఉద్యోగం పేరుతో ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లి రెండుసార్లు విక్రయించి, రెండు సంవత్సరాల పాటు లైంగిక దాడులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చివరకు తప్పించుకుని స్వగ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు మానవ అక్రమ రవాణాపై ఆందోళన కలిగిస్తోంది.


